రాజ్ భవన్ కంప్లైంట్ బాక్స్.. 317 జీవో పై ఫిర్యాదు

రాజ్ భవన్ కంప్లైంట్ బాక్స్.. 317 జీవో పై ఫిర్యాదు

రాజ్ భవన్ ముందు గవర్నర్ తమిళసై కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కంప్లెన్ట్ బాక్స్ లో 317 జీవో పై ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ  జీవన్ రెడ్డి. 317 జీవోతో రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఆర్టికల్ 317 డీ  ఉల్లంఘన జరుగుతోందని విమర్శించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జీవన్ రెడ్డి గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళసై తాజాగా రాజ్ భవన్ వద్ద ఫిర్యాదులు తీసుకునేందుకు కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేశారు.  ప్రజలు రాతపూర్వకంగా తమ సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని, ఫిర్యాదులు చేయొచ్చని చెప్పారు. ‘‘పబ్లిక్ సమస్యలు పరిష్కారమయ్యేలా ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్తాను. ఆర్థిక సాయం వంటి సమస్యలపై నా వంతు సాయం అందజేస్తాను”  అని గవర్నర్  తెలిపారు.

ఇవి కూడా చదవండి:

బండి సంజయ్ కు బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా ఫోన్ 

ప్రజల ఆరోగ్యమే మాకు ముఖ్యం