హైదరాబాద్, వెలుగు: వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్ఎమ్మెల్సీ పోలింగ్ రోజు వేతనంతో కూడిన హాఫ్ డే లీవ్ ఇచ్చేలా అన్ని శాఖలను ఆదేశించాలని సీఈవో వికాస్ రాజ్కు కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది.
శనివారం పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ జి. నిరంజన్ సీఈవోకు లేఖ రాశారు. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నిక ఉందని, ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాడ్యుయేట్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు సెలవు ఇచ్చేలా ప్రభుత్వ శాఖలను ఆదేశించాలని కోరారు.
