కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. ఉదయం నుంచే భక్తులు మల్లన్నకు బోనం సమర్పించి పట్నాలు వేసి మొక్కులు చెల్లించారు. గంగరేగు చెట్టుకు ముడుపులు కట్టి వేడుకున్నారు. దర్శనానికి నాలుగు నుంచి ఐదు గంటల సమయం పట్టింది.
మల్లన్న కొండపైన ఉన్న రేణుక ఎల్లమ్మ తల్లికి కల్లు, బెల్లం పానకం, బోసం చెల్లించారు. భక్తుల కావల్సిన అవసరాలను ఆలయ ఈవో వెంకటేశ్, ఏఈవో శ్రీనివాస్, ప్రధానార్చకుడు మహదేవుని మల్లికార్జున్, ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు.
