అమీన్పూర్, వెలుగు: పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ బండల మల్లన్న జాతర మహోత్సవ పోస్టర్ను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్, గూడెం మధుసూదన్రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు మల్లేశ్యాదవ్, సభ్యులు పాల్గొన్నారు.
కాలనీ సమస్యలు పరిష్కరిస్తా
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట మైత్రి విల్లాస్ కాలనీలోని సమస్యలను ప్రణాళికబద్ధంగా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం మున్సిపల్ మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నర్సింహాగౌడ్తో కలిసి కాలనీ వాసులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.
కాలనీ వాసుల వినతి మేరకు త్వరలోనే డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ, నాయకులు శ్రీకాంత్, శ్రీనివాస్రెడ్డి, కొల్లూరు యాదగిరి, జ్ఞాణేశ్వర్, కాలనీ అధ్యక్షుడు గోపీనాథ్రెడ్డి పాల్గొన్నారు.
అథ్లెటిక్స్ పోటీలకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం
మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడలకు సంపూర్ణ సహకారం అందిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ నెల 27, 28 తేదీల్లో కరీంనగర్ కేంద్రంగా జరుగనున్న క్రీడలో పాల్గొంటున్న సంగారెడ్డి జిల్లా జట్టుకు లక్షాయాభై వేలు ఆర్థిక సాయం చేశారు. ఆదివారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని తన నివాసంలో జిల్లా జట్టుకు నగదు అందజేశారు.
రాష్ర్ట స్థాయి పోటీల్లో సంగారెడ్డి జిల్లా జట్టు ఘన విజయం సాధించాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఫహీం ఇక్భాల్, కార్యదర్శి సామెల్, క్రీడాకారులు పాల్గొన్నారు.
