దుబ్బాకను ఆదర్శంగా తీర్చిదిద్దాలి : ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి 

దుబ్బాకను ఆదర్శంగా తీర్చిదిద్దాలి : ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి 

తొగుట (దుబ్బాక)వెలుగు: సిద్దిపేట జిల్లా దుబ్బాకను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సూచించారు. మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీరామ్ సంగీత రవీందర్ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన పాలకవర్గం తొలి సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. రోడ్లు, శానిటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తాగునీటి సరఫరా వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.