శివ్వంపేట, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఓ సర్పంచ్ అభ్యర్థి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సంఘటన శివ్వంపేట మండలం దొంతి గ్రామంలో జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో చింతల బస్తీ వాసులు నీటి ఎద్దడి తీర్చాలని బీఆర్ఎస్మద్దతుతో సర్పంచ్పదవికి పోటీచేసిన అభ్యర్థి సుశీల బాబును కోరారు. అందుకు స్పందించిన ఆమె తాను సర్పంచ్ గా గెలవగానే ఆ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. అయినప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం శనివారం రాత్రి సుశీల బాబు సొంత డబ్బులతో బోరు తవ్వించారు. కార్యక్రమంలో వార్డు మెంబర్లు సుకుమార్, సుజాత, రమేశ్, మమత కృష్ణ , రాములు, స్వామి, మండల పరిషత్ మాజీ కో ఆప్షన్ మెంబర్ లాయక్, నాయకులు భిక్షపతి, శ్రీనివాస్, అనిల్ పాల్గొన్నారు.
