శివ్వంపేట, వెలుగు: మండలంలోని తిమ్మాపూర్ లో ఆదివారం పంచాయతీ ఆఫీసుకు బీఆర్ఎస్ రంగు వేయడంతో కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొద్దిసేపు బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులకు మధ్య గొడవ జరిగింది. సర్పంచ్ రాజుపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్నాయకులు డిమాండ్ చేశారు. అధికారులు జోక్యం చేసుకొని రంగు మారుస్తామని చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
