‘సాగర్‘ లో కాంగ్రెస్ గెలవకపోతే పాలిటిక్స్ ఊసెత్తను

‘సాగర్‘ లో కాంగ్రెస్ గెలవకపోతే పాలిటిక్స్ ఊసెత్తను
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవకపోతే  రాజకీయాల గురించి మాట్లాడనన్నారు ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. సాగర్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. ఐకెపి సెంటర్ లు బంద్ పెడితే టిఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు ఎమ్మెల్యేలను రైతులు ఉరికించి కొడతారన్నారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వ తరహా అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. భువనగిరి మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి మంత్రి జగదీష్ రెడ్డి రావడం సిగ్గు చేటన్నారు. కేసీఆర్ అవినీతి పై బీజేపీ రాజీపడ్డా తాము వదిలిపెట్టి ప్రసక్తే లేదన్నారు. యాదగిరిగుట్టలో షాపులు ఇండ్లు కోల్పోయిన వారికి ఎందుకు నష్టపరిహారం ఇవ్వడం లేదన్నారు. ఏడు సంవత్సరాలుగా పట్టించుకోని నాయకులు ఇపుడు గొర్రెలు పంపిణీ చేస్తున్నారన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మత రాజకీయాల వల్లే కాంగ్రెస్ కు ఇబ్బందులన్నారు. జిల్లా మంత్రి భువనగిరినిపట్టించుకోవడం లేదన్నారు. see more news శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో చిరుత నువ్వే నా హీరో.. మిస్‌ యూ డాడీ   ఆ రెండింటిని చూస్తే అస్సలు ఆగలేను..