తెలంగాణలో 40 వేలకు చేరువైన కరోనా కేసులు

తెలంగాణలో 40 వేలకు చేరువైన కరోనా కేసులు

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో కరోనా పాజిటివ్​ కేసులు 40 వేలకు చేరువయ్యాయి. బుధవారం మరో 1,597 మందికి కరోనా పాజిటివ్​ వచ్చింది. 11 మంది చనిపోయారు. 13,642 టెస్టులు చేశారు. 1,159 మంది కోలుకుని హాస్పిటళ్ల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,08,666 టెస్టులు చేయగా.. 39,342 మందికి పాజిటివ్​ వచ్చిందని హెల్త్​ డిపార్ట్​మెంట్​ బులెటిన్​లో ప్రకటించింది.

25,999 మంది కోలుకుని డిశ్చార్జి కాగా 12,958 మంది ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నట్టు తెలిపింది. మొత్తంగా 386 మంది చనిపోయారు. బుధవారం కేసుల్లో గ్రేటర్​ హైదరాబాద్​లోనే 796 మందికి పాజిటివ్​ వచ్చింది. రంగారెడ్డిలో 212, మేడ్చల్​లో 115, సంగారెడ్డిలో 73, నల్గొండలో 58, వరంగల్​ అర్బన్​లో 44, కరీంనగర్​లో 41, కామారెడ్డిలో 30, సిద్దిపేటలో 27, మంచిర్యాలలో 26, మహబూబ్​నగర్​లో 21,  పెద్దపల్లిలో 20, భూపాలపల్లిలో 15, యాదాద్రి, నిజామాబాద్​లో 13 మంది చొప్పున, జనగామలో 8, కొత్తగూడెంలో 7, ఖమ్మం, సిరిసిల్లలో 6 చొప్పున, మహబూబాబాద్​, వనపర్తి, నారాయణపేట, వికారాబాద్​, నాగర్​కర్నూల్​లో 5 చొప్పున, సూర్యాపేట, ములుగులో 4, ఆదిలాబాద్​లో ఒక కేసు నమోదయ్యాయి.

ఉస్మానియా దవాఖానలో ఎటు చూసినా  వరద బురద