
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 40 వేలకు చేరువయ్యాయి. బుధవారం మరో 1,597 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. 11 మంది చనిపోయారు. 13,642 టెస్టులు చేశారు. 1,159 మంది కోలుకుని హాస్పిటళ్ల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,08,666 టెస్టులు చేయగా.. 39,342 మందికి పాజిటివ్ వచ్చిందని హెల్త్ డిపార్ట్మెంట్ బులెటిన్లో ప్రకటించింది.
25,999 మంది కోలుకుని డిశ్చార్జి కాగా 12,958 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు తెలిపింది. మొత్తంగా 386 మంది చనిపోయారు. బుధవారం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్లోనే 796 మందికి పాజిటివ్ వచ్చింది. రంగారెడ్డిలో 212, మేడ్చల్లో 115, సంగారెడ్డిలో 73, నల్గొండలో 58, వరంగల్ అర్బన్లో 44, కరీంనగర్లో 41, కామారెడ్డిలో 30, సిద్దిపేటలో 27, మంచిర్యాలలో 26, మహబూబ్నగర్లో 21, పెద్దపల్లిలో 20, భూపాలపల్లిలో 15, యాదాద్రి, నిజామాబాద్లో 13 మంది చొప్పున, జనగామలో 8, కొత్తగూడెంలో 7, ఖమ్మం, సిరిసిల్లలో 6 చొప్పున, మహబూబాబాద్, వనపర్తి, నారాయణపేట, వికారాబాద్, నాగర్కర్నూల్లో 5 చొప్పున, సూర్యాపేట, ములుగులో 4, ఆదిలాబాద్లో ఒక కేసు నమోదయ్యాయి.
ఉస్మానియా దవాఖానలో ఎటు చూసినా వరద బురద