11 మంది శిక్షణా సైనికులకు కరోనా పాజిటివ్

11 మంది శిక్షణా సైనికులకు కరోనా పాజిటివ్

ఇండో-టిబెట్‌ సరిహద్దు భద్రతా దళ ట్రైనింగ్ సెంటర్ లోని 11 మంది సైనికులు కరోనా బారినపడ్డారు. వీరిని ట్రీట్ మెంట్ కోసం శివగంగ ప్రభుత్వ ఆస్పత్రిలోని కరోనా ప్రత్యేక వార్డుకు తరలించారు. శివగంగ జిల్లా ఇలుపకుడిలోని ఇండో-టిబెట్‌ సరిహద్దు భద్రత దళ శిక్షణ కేంద్రంలో మహారాష్ట్ర, ఒడిశా, కర్నాటక, ఆంధ్ర, తదితర రాష్ట్రాలకు చెందిన 500 మంది సైనికులు శిక్షణ పొందుతున్నారు. వీరికి గురువారం కరోనా పరీక్షలు నిర్వహించగా, మహారాష్ట్రకు చెందిన 11 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరికొందరి ఫలితాలు రావాల్సి ఉందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.