టెస్టుల నుంచి మరణాల దాకా అన్నీ దాచుడే

టెస్టుల నుంచి మరణాల దాకా అన్నీ దాచుడే
  • అరకొర సమాచారంతో హెల్త్​ బులెటిన్లు
  • సోషల్ మీడియాలో సర్కారును నిలదీస్తున్న నెటిజన్లు
  • మంత్రులను ట్యాగ్ చేస్తూ పోస్టులు..దాచేస్తే రాష్ట్రానికే నష్టమంటున్న నిపుణులు

కరోనా టెస్టుల నుంచి మరణాల వరకు ఒక్క విషయం లోనూ రాష్ర్ట సర్కార్ నిక్కచ్చి గా ఉండడం లేదన్న విమర్శలు వెల్లువెత్ తుతున్నాయి. ప్రభుత్వ తీరును వేలాది మంది సో షల్ మీడియాలో ఎండగడుతున్నారు.మామూలు జనం నుంచి పెద్ద పెద్ద ప్రొఫెసర్ల వరకు మంత్రులను ట్యాగ్ చేస్తూ తమ అనుమానాలపై ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇండి యన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్​ (ఐసీఎంఆర్ ) రూల్స్​ పాటిస్తున్నామని ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ చెబుతుంటే..ఒక్క తెలంగాణకే సెపరేట్ రూల్స్​ పెట్టారా అంటూ ప్రశ్నిస్తున్నారు. దాదాపు అన్ని రాష్ట్రాలూ డైలీ బులెటిన్లలో టెస్టుల సంఖ్య, జిల్లా ల్లో కేసులు, మరణాలను ప్రకటిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలైతే కరోనా బాధితులకు వైరస్ ఎట్లా సోకిందో కూడా చెబుతున్నాయి. మన రాష్ట్రం లో మాత్రం కేవలం కేసులు, మరణాలు, డిశ్చార్జి వివరాలను మాత్రమే వెల్లడి స్తున్నారు. ఏయే జిల్లా లో ఎన్ని కేసులన్న విషయాన్నీ స్పష్టం గా చెప్పట్లేదు. మరణాల సంఖ్యను మారుస్తున్నారే తప్ప, వాళ్లు ఎప్పుడు చనిపోయిందీ చెప్పట్లేదు. కొన్ని మరణాలను అసలు బయటకు వెల్లడిం చట్లేదు. దీంతో సర్కారు తీరుపై ప్రజల్లో ఎన్నెన్నో అనుమానాలు వస్తున్నాయి. ఇట్లా కరోనా వివరాలను దాచేస్తే రాష్ట్రానికే ఎక్కువ నష్టమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరణాల లెక్కా మిస్టరీనే…..

రాష్ట్రం లో కరోనా మరణాల లెక్క కూడా మిస్టరీ గా మారింది. చాలా వరకు మరణాలను సర్కరా దాచేస్తోంది. దానిని సమర్థిం చుకునేలా ఐసీఎంఆర్ చెప్పినట్టే చేస్తున్నామని చెబుతోంది. ఎప్పటినుం చో కేన్సర్, కిడ్నీ, గుండె జబ్బుల వంటి వాటితో బాధపడుతూ కరోనాతో చనిపోయినోళ్లను కరోనా లెక్కలోకి తీసుకోవద్దని ఐసీఎంఆర్ గైడ్ లైన్స్​ ఇచ్చిందంటూ ఇటీవల ఈటల రాజేందర్ ప్రకటించారు. కానీ, ఐసీఎంఆర్ గైడ్ లైన్స్​లో ఎక్కడా ఆ విషయం లేదు. అలాంటి గైడ్ లైన్స్​ ఏవీ ఇవ్వలేదని హైదరాబాద్ లోని ఐసీఎంఆర్ అనుబంధ సంస్థ నేషనల్ ఇనిస్టిట్యూ ట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ ఐఎన్ ) కూడా చెబుతోంది. ఇటు ఆదివారం నాటి కి 53 మంది చనిపోయారని ఆరోగ్య శాఖ చెబుతున్నా.. 90కి పైగా శవాలకు తామే దహన సంస్కారాలు చేశామని, అందులో కరోనా కేసులతో పాటు సస్పెక్టె డ్ కేసులు ఉన్నాయని జీహెచ్ ఎంసీ అధికారులు అంటున్నారు.

టెస్టులు చాలా తక్కువ…..

దే శమంతటా ఇప్పటిదాకా 29 లక్షలు టెస్టులు చేయగా, రాష్ట్రం లో మాత్రం 29 వేలు కూడా దాటలేదు. లక్షణాలుం టే తప్ప టెస్టులు చేయబోమన్న సర్కార్ .. ప్రైమరీ కాంటాక్ట్​లకూ టెస్టులను బంద్ పెట్టింది. అయితే, ప్రజల నుంచి ఒత్తిడి పెరగడం, ప్రతిపక్షాల విమర్శలు, టెస్టులను పెంచాలన్న కేంద్రం సూచనలతో ఇప్పుడు ప్రైమరీ కాంటాక్ట్​లకూ టెస్టులు చేస్తోంది. రోజూ ఎన్ని టెస్టులు చేస్తున్నారన్న విషయాన్ని మాత్రం చెప్పట్లేదు. ప్రైవేట్ ల్యాబుల్లో టెస్టులకు సర్కార్ అనుమతివ్వలేదు. కానీ, కొన్ని ల్యాబుల్లో దొంగచాటుగా వేల సంఖ్యలో టెస్టులు చేశారు. ఈవిషయం తెలిసినా సర్కార్ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ప్రైవేట్ లో కరోనా ట్రీట్ మెంట్ పైనా ఒక్కోసారిఒక్కోలా సర్కార్ ప్రకటనలు ఉంటు న్నాయి. ప్రైవేట్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రీట్ మెంట్ చేయడానికి వీల్లేదని, అందరినీ గాంధీకే పంపించాలని సీఎంకేసీఆర్ చాలా సార్లు ప్రెస్ మీట్ లలో చెప్పా రు. అయితే,తాజాగా ఈటల మాత్రం ప్రైవేట్ ఆస్పత్రుల్లో ట్రీట్ మెంట్ చేయొద్దని ఎప్పుడూ చెప్పలేదన్నారు. పేషెంట్ పరిస్థితి సీరియస్ అయితే ప్రభుత్వ ఆస్పత్రులకు పంపొద్దని మాత్రమే చెప్పా మన్నారు.

వానాకాల నుంచే పంటల వివరాలు నమోదు