
కేరళలోని కోజికోడ్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతున్న విమానం ఘోర ప్రమాదానికి గురైంది. టేబుల్ టాప్ వంటి ఆ విమానాశ్రయంలో విమానం రన్ వే మీద నుంచి జారిపోయి రెండు ముక్కలైంది. దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో ప్రమాద సమయంలో 184 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇద్దరు పైలట్లు సహా మొత్తం 18 మంది ఈ ఘటనలో చనిపోయారు. విమానంలో చిక్కుకుపోయిన వారిని వెలికి తీసేందుకు దాదాపు మూడు గంటలకు పైగా సమయం పట్టింది. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న 22 మంది అధికారులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని మలప్పురం వైద్యాధికారి తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తైన తర్వాత వీరిని క్వారంటైన్ కు తరలించారని చెప్పారు. ప్రమాదం జరిగిన తర్వాత స్థానికులతో పాటు దాదాపు 600 మందిని క్యారంటైన్ కు వెళ్లాలని సూచించారు. వీరిలో ఎంత మంది కరోనా బారిన పడ్డారనే విషయంపై జిల్లా వైద్యాధికారులు ప్రస్తుతం సమీక్ష నిర్వహిస్తున్నారు.