గుజరాత్‌ సీఎం కు కరోనా పాజిటివ్‌

గుజరాత్‌ సీఎం కు కరోనా పాజిటివ్‌

గుజరాత్‌ సీఎం  విజయ్ రూపానీ కరోనా బారిన పడ్డారు. విజయ్ రూపానీ.. నిన్న వడోదరాలో ఓ సభలో మాట్లాడుతుండగా వేదికపైనే కుప్పకూలి స్పృహ కోల్పోయారు. ఆయన్ను వెంటనే హెలికాప్టర్ ద్వారా అహ్మదాబాద్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా, కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.

ప్రస్తుతం ఆయన అహ్మదాబాద్ లోని US మెహతా ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.సీఎం రూపానీ కరోనా బారినపడినట్టు ఆస్పత్రి బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఈసీజీ, సీటీ స్కాన్ రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యూఎన్ మెహతా ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ ఆర్కే పటేల్ ప్రకటించారు.