మంత్రి నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటివ్

మంత్రి నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటివ్

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  కరోనా బారినపడ్డారు. ఇవాళ(గురువారం) ఆయనకు కరోనా టెస్టులు నిర్వహించగా.. పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మంత్రి నిరంజన్ రెడ్డి నిన్న కూడా గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొన్నారు.ఈ క్రమంలో స్వల్ప లక్షణాలు ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు.

తనకు కరోనా సోకడంపై స్పందిస్తూ, కొన్నిరోజులుగా తనను కలిసిన వాళ్లందరూ జాగ్రత్తగా ఉండాలని, వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు నిరంజన్ రెడ్డి.

మరిన్ని వార్తల కోసం...

ఒమిక్రాన్‌ సోకితే 'డెల్టా' రాదన్న ICMR