
యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామానికి ఓ వలస కూలీ అయిన గర్భిణీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని మండల వైద్యాధికారులు తెలుపుతూ..వేరే ప్రాంతం నుండి ఇటీవలే స్వగ్రామానికి చేరుకుందని.. ఆమెనే కుటుంబ సభ్యులతో కలిసి 2 రోజుల క్రితం బీబీనగర్ ఎయిమ్స్ ప్రభుత్వ క్వారంటైన్ వెళ్లిందని తెలిపారు. అయితే వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా గర్భీణీకి పాజిటివ్ వచ్చిందని నిర్థారణ చేశామని చెప్పారు అధికారులు. ఆమె ప్రస్తుతం 7 నెలల గర్భీణీ అని.. ట్రీట్ మెంట్ అందిస్తున్నట్లు తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధికారులు సంస్థాన్ నారాయణపురంలో చర్యలు చేపట్టారు. ప్రజలను అలెర్ట్ చేశారు.