కరోనా పాజిటివ్ మహిళకు 108లో ప్రసవం

కరోనా పాజిటివ్ మహిళకు 108లో ప్రసవం

సిద్దిపేట, వెలుగు: కరోనా వచ్చిన ఓ మహిళ 108లో ప్రసవించింది. హుజురాబాద్ ప‌ట్టణానికి చెందిన గర్భిణికి ఇటీవల కరోనా సోకింది. నెలలు నిండడంతో ఆమెకు మంగళవారం తెల్లవారుజామున నొప్పులు ప్రారంభమయ్యాయి. వెంటనే హుజురాబాద్ నుంచి 108లో హైదరాబాద్ కు తరలిస్తుండగా శామీర్ పేట వద్దకు చేరుకోగానే మగబిడ్డను ప్రసవించింది. 108 అంబులెన్స్ లో డ్యూటీ చేస్తున్న శ్రీనివాస్, మల్లేశం పీపీఈ కిట్లు ధరించి ఆమెకు సుఖ ప్రసవం జరిగేలా చూశారు. వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం