రాష్ట్రంలో 50 లక్షలు దాటిన కరోనా టెస్టులు

రాష్ట్రంలో 50 లక్షలు దాటిన కరోనా టెస్టులు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 894 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,61,728 కేసులు నమోదయ్యాయి. తాజాగా గురువారం కరోనా బారినపడి నలుగురు చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1,423కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1,057 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 2,47,790గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,515 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా.. మరో 10,245 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. గురువారం 39,448 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 50,50,612 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.54 శాతంగా మరియు రికవరీ రేటు 94.67 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 154, మేడ్చల్ 84, రంగారెడ్డి 70, భద్రాది 54, నల్గొండ 48, వరంగల్ అర్బన్ 41, ఖమ్మం 39, కరీంనగర్ 36, జగిత్యాల 32, సంగారెడ్డి 32 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

యూట్యూబర్‌పై రూ. 500 కోట్ల పరువునష్టం దావా వేసిన అక్షయ్ కుమార్

వ్యాను, ట్రక్కు ఢీ.. ఆరుగురు పిల్లలతో సహా 14 మంది మృతి