
- అటెండ్ కానున్న పార్టీ చీఫ్ డి.రాజా
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ లో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు సీపీఐ జాతీయ సమితి సమావేశాలు జరగనున్నాయి. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాలు కీలకమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. గురువారం ఆయన మగ్దుంభవన్ లో సీపీఐ నేతలు అజీజ్ పాషా, వెంకట్ రెడ్డి తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఈ నెల 2 నుంచి 4 వరకూ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ కమిటీ సమావేశాలు ఉంటాయని చెప్పారు. ఈ సమావేశాల్లో తాజా రాజకీయ పరిణామాలు, లోక్ సభ ఎన్నికలు, ఇండియా కూటమి తదితర అంశాలపై చర్చించనున్నట్టు తెలిపారు.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల నుంచి సుమారు150 మంది జాతీయ సమితి సభ్యులు అటెండ్ అవుతారని వివరించారు. 4న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘పాలస్తీనా సంఘీభావ సభ’ను నిర్వహిస్తామని, ఈ సభకు సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీఎం రేవంత్ రెడ్డి అటెండ్ అవుతారని కూనంనేని వెల్లడించారు.