Suryakumar Yadav: ఐర్లాండ్ గడ్డపై జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత జట్టు ఓడిపోగా.. మరోవైపు, ఇండియా టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ముంబై నగర రోడ్లపై చిల్ అయ్యాడు. అదేంటి, టీమిండియా ఓడిపోతే, సూర్య భాయ్ ఎందుకు ఎంజాయ్ చేస్తున్నాడని మీరు డౌట్ పడుతున్నారా? అసలు ముచ్చట ఏంటంటే.. ప్రస్తుతం క్రికెట్ మ్యాచ్ల నుంచి బ్రేక్ రావడంతో.. దొరికిన కాస్త ఖాళీ సమయాన్ని అతను ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. తన భార్య దేవిషా శెట్టితో కలిసి ముంబై వీధుల్లో లేట్ నైట్ డ్రైవ్కు వెళ్లిన స్కై.. ఫ్యాన్స్కు ఒక స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చాడు.
సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్:
మైదానంలో బౌలర్లను ఉతికారేసే సూర్యకుమార్ యాదవ్, రియల్ లైఫ్లో మాత్రం చాలా సైలెంట్గా ఉంటాడు. ప్రొఫెషనల్ క్రికెట్ ఒత్తిడి నుంచి కాస్త రిలాక్స్ అవ్వడం కోసం, ముంబైలో అర్ధరాత్రి వేళ ట్రాఫిక్ లేని ప్రశాంతమైన రోడ్లపై దేవిషాతో కలిసి అతను లాంగ్ డ్రైవ్కు వెళ్లాడు. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా చాలా సింపుల్గా ఈ జంట కార్ డ్రైవ్ను ఎంజాయ్ చేసింది. ఎప్పుడూ బిజీ క్రికెట్ షెడ్యూల్తో ఉండే సూర్య.. ఫ్యామిలీకి టైమ్ ఇవ్వడం ఎంత ముఖ్యమో ఈ లేట్ నైట్ ఔటింగ్తో మరోసారి చూపించాడు.
ALSO READ : ఎవరినీ లైట్ తీసుకోకండి..
సోషల్ మీడియాలో క్రేజీ కపుల్:
సూర్యకుమార్ యాదవ్, దేవిషా శెట్టిల మధ్య ఉన్న బాండింగ్ క్రికెట్ సర్కిల్లో ఫుల్ ఫేమస్.. 2016 లో పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఒకరికొకరు ఎప్పుడూ అండగా నిలుస్తూ ఉంటారు. సూర్య కెరీర్లో ప్రతి ముఖ్యమైన మలుపులోనూ దేవిషా అతని వెంటే ఉంటూ మోరల్ సపోర్ట్ ఇచ్చింది. తమ పర్సనల్ లైఫ్కు సంబంధించిన క్యూట్ మూమెంట్స్ను ఈ జోడీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ను ఖుషీ చేస్తుంటుంది.
