వయసు దాచినందుకు జడ్పీటీసీ పై క్రిమినల్ కేసు

వయసు దాచినందుకు జడ్పీటీసీ పై క్రిమినల్ కేసు

నల్గొండ జిల్లా చందంపేట జడ్పీటీసీ పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. గడిచిన స్థానిక ఎన్నికల్లో చందంపేట నుంచి జడ్పీటీసీ గా గెలిచిన రమావత్ పవిత్రపై ఆమె ప్రత్యర్థి బుజ్జి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎన్నికల సమయంలో తన వయసును తప్పుగా చూపించి పోటీ చేసిందని బుజ్జి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీస అర్హత 21 సంవత్సరాలుండగా… పవిత్ర తన అసలు వయసును దాచి పోటీ చేసిందని తెలిపాడు. ఆ సమయంలో తన  వయస్సు 19 ఏండ్లని, తన టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ లో కూడా అదే వయసుందని, అయితే పోటీ చేద్దామనే కారణంగా వయస్సును ఆ సర్టిఫికెట్ లో మార్ఫింగ్ చేసిందని బుజ్జి పోలీసులకు తెలిపాడు. బుజ్జి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.

criminal-case-registered-on-nalgonda-dist-chandampeta-zptc