హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.37 లక్షలు సీజ్

హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.37 లక్షలు సీజ్

హైదరాబాద్: సైబరాబాద్ SOT పోలీసులు సోమవారం క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రాజేంద్రనగర్, యస్.ఓ.టి, ఆర్.సి పురం పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో సిటీ పలుచోట్లు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఆన్ లైన్ బెట్టింగులు నిర్వహిస్తున్న ఓ గ్యాంగ్ ను అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ ఎస్ఓటి డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.

రూ.18లక్షల నగదుతోపాటు మరో రూ.18లక్షల 34 వేల బ్యాంక్ అకౌంట్ మొత్తం రూ.37లక్షల 84వేల 918 పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిల్లీ కేంద్రంగా ఓ ఆన్ లైన్ యాప్ తయారు చేసి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ సెంటర్‌గా రామకృష్ణ గౌడ్, ఉపేందర్ గౌడ్‌ లు ఈ బెట్టింగ్ దందా నడుపుతున్నట్లు గుర్తించి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ బెట్టింగ్ గ్యాంగ్ లో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 7777 వెబ్ సైట్, యాప్ ఏర్పాటు చేసుకుని 40 మందితో గ్యాంగ్ బెట్టింగులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.