వైకుంఠ ఏకాదశికి ఆలయాల ముస్తాబు

వైకుంఠ ఏకాదశికి  ఆలయాల ముస్తాబు

ఈ నెల 23న వైకుంఠ ఏకాదశి సందర్భంగా గ్రేటర్ సిటీలోని వైష్ణవాలయాలు ముస్తాబవుతున్నాయి. చిక్కడపల్లిలోని వేంకటేశ్వర స్వామి ఆలయం, అడిక్ మెట్ లోని బాలాజీ ఆలయాన్ని పూలతో అందంగా అలంకరిస్తున్నారు. ఉత్తర ద్వారం నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చిక్కడపల్లి ఆలయ ఈవో రామాంజనేయులు తెలిపారు. శనివారం ఉదయం 5 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు ఆయన చెప్పారు.  – వెలుగు, ముషీరాబాద్