
ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి చెందిన కొందరు వ్యక్తుల ప్రమేయం ఉందని పశ్చిమ ఢిల్లీ , బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ సంచలన ఆరోపణలు చేశారు. ఒబెరాయ్ హోటల్ లో లిక్కర్ స్కాం డీల్ కుదిరిందని అన్నారు. తెలంగాణకు చెందిన ఓ లిక్కర్ మాఫియా నేత ఏర్పాటు చేసిన ప్రైవేటు విమానంలో ఢిల్లీకి వచ్చిన కేసీఆర్ కుటుంబ సభ్యులు.. మొదటి ఇన్ స్టాల్మెంట్ కింద రూ.150 కోట్లు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ఇచ్చారని MP పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ ఆరోపించారు.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో కలిసి ఒబెరాయ్ హోటల్ లోనే పాలసీని రూపొందించారన్నారు. ఇదే మద్యం పాలసీ తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాలలోనూ అమలవుతోందని తెలిపారు. KCR కుటుంబసభ్యులతో మీటింగ్ జరిపారా ? లేదా ? చెప్పాలని మనీశ్ సిసోడియాను ఎంపీ పర్వేశ్ డిమాండ్ చేశారు.