
- ఇండియన్ల కోసం ప్రత్యేకంగా ఎయిర్ స్పేస్ తెరిచిన ఇరాన్
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఇరాన్లో ఉన్న మన దేశ స్టూడెంట్లను తరలించేందుకు ఇండియా చర్యలు చేపట్టింది. ‘ఆపరేషన్ సింధు’లో భాగంగా రెండో బ్యాచ్ కింద 290 మంది స్టూడెంట్లతో ఫస్ట్ విమానం ఢిల్లీలో ల్యాండయింది. రెండో, మూడో విమానాలు శనివారం ఢిల్లీకి రానున్నాయి. ఇండియన్ ఫ్లైట్ల కోసం ప్రత్యేకంగా ఇరాన్ తన గగనతలాన్ని తెరిచింది.
యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో ఇటీవల ఆ దేశం తన గగనతలాన్ని మూసివేసింది. పలు ఇంటర్నేషనల్ ఫ్లైట్ల రాకపోకలను నిషేధించింది. అయితే, ఇండియా కోసం ప్రత్యేకంగా తన గగనతలాన్ని తెరిచే విషయంలో మినహాయింపు ఇచ్చింది. ఈ వారం మొదట్లో 110 మంది ఇండియన్ స్టూడెంట్లను ఉత్తర ఇరాన్ నుంచి రోడ్డు మార్గంలో అర్మేనియాలోని యెరెవాన్కు తరలించారు.
అక్కడి నుంచి ఈ నెల 18న ప్రత్యేక విమానంలో వారు ఢిల్లీకి చేరుకున్నారు. ఆ తర్వాత వారిని సొంతూళ్లకు పంపించారు. పలువురు మెడికల్ స్టూడెంట్లు ఇరాన్లోని అజర్బైజాన్ ప్రావిన్స్లోని ఉర్మియా మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్నారు. ఇరాన్లో మొత్తం 4 వేల మంది ఇండియన్లు నివాసం ఉంటున్నారు. అందులో సగానికి పైగా స్టూడెంట్లే ఉన్నారని అధికారులు వెల్లడించారు.