ఇరాన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న 290 మంది మన స్టూడెంట్లు

ఇరాన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న 290 మంది మన స్టూడెంట్లు
  • ఇండియన్ల కోసం ప్రత్యేకంగా ఎయిర్​ స్పేస్​ తెరిచిన ఇరాన్​

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌, ఇరాన్‌‌‌‌‌‌‌‌ యుద్ధం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఇరాన్‌‌‌‌‌‌‌‌లో ఉన్న మన దేశ స్టూడెంట్లను తరలించేందుకు ఇండియా చర్యలు చేపట్టింది. ‘ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ సింధు’లో భాగంగా రెండో బ్యాచ్​ కింద 290 మంది స్టూడెంట్లతో ఫస్ట్​ విమానం ఢిల్లీలో ల్యాండయింది. రెండో, మూడో విమానాలు శనివారం ఢిల్లీకి రానున్నాయి. ఇండియన్‌‌‌‌‌‌‌‌ ఫ్లైట్ల కోసం ప్రత్యేకంగా ఇరాన్‌‌‌‌‌‌‌‌ తన గగనతలాన్ని తెరిచింది. 

యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో ఇటీవల ఆ దేశం తన గగనతలాన్ని మూసివేసింది. పలు ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ ఫ్లైట్ల రాకపోకలను నిషేధించింది. అయితే, ఇండియా కోసం ప్రత్యేకంగా తన గగనతలాన్ని తెరిచే విషయంలో మినహాయింపు ఇచ్చింది. ఈ వారం మొదట్లో 110 మంది ఇండియన్ స్టూడెంట్లను ఉత్తర ఇరాన్ నుంచి రోడ్డు మార్గంలో అర్మేనియాలోని యెరెవాన్‌‌‌‌‌‌‌‌కు తరలించారు.

 అక్కడి నుంచి ఈ నెల 18న ప్రత్యేక విమానంలో వారు ఢిల్లీకి చేరుకున్నారు. ఆ తర్వాత వారిని సొంతూళ్లకు పంపించారు. పలువురు మెడికల్‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్లు ఇరాన్‌‌‌‌‌‌‌‌లోని అజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బైజాన్‌‌‌‌‌‌‌‌ ప్రావిన్స్‌‌‌‌‌‌‌‌లోని ఉర్మియా మెడికల్‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీలో చదువుతున్నారు. ఇరాన్‌‌‌‌‌‌‌‌లో మొత్తం 4 వేల మంది ఇండియన్లు నివాసం ఉంటున్నారు. అందులో సగానికి పైగా స్టూడెంట్లే ఉన్నారని అధికారులు వెల్లడించారు.