ఫీజు కట్టలేదని విద్యార్థులను తీసేయొద్దు

ఫీజు కట్టలేదని విద్యార్థులను తీసేయొద్దు

హైదరాబాద్, వెలుగు: కరోనాతో పేరెంట్స్ ను కోల్పోయిన, తల్లిదండ్రులలో ఒక్కరు దూరమైన స్టూడెంట్లు ట్యూషన్ ఫీజు చెల్లించకపోయినా.. వాళ్లకు యూనిఫాం, లెర్నింగ్ మెటీరియల్ లేకున్నా స్కూల్ నుంచి తొలగించొద్దని ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్ల మేనేజ్​మెంట్లను పాఠశాల విద్యా శాఖ ఆదేశించింది. జీవో నంబర్ 75 ప్రకారం 2021–22 అకడమిక్ ఇయర్​లో ఫీజులు పెంచొద్దని, స్టూడెంట్ల నుంచి నెలనెలానే ఫీజులు తీసుకోవాలని సూచించింది. రూల్స్​ పాటించకపోతే గుర్తింపు రద్దు చేసేందుకూ వెనుకాడబోమని హెచ్చరించింది. ఈ నెల ఫస్ట్ నుంచి ఫిజికల్ క్లాసులు ప్రారంభమవడంతో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన మేనేజ్​మెంట్లు, టీచర్లు, హెడ్మాస్టర్లు పాటించాల్సిన సూచనలను (ఎస్​ఓపీ) మంగళవారం విడుదల చేశారు. స్కూళ్లలో ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని.. స్టూడెంట్లు, టీచర్లు మాస్కులు పెట్టుకోవాలని చెప్పారు. కరోనా కేసులు ఇంకా తగ్గలేదు కాబట్టి మళ్లీ ఆదేశాలు ఇచ్చేంతవరకూ బడుల్లో గేమ్స్, గ్రూప్ డిస్కషన్స్, స్కూల్ అసెంబ్లీ బంద్ ​చేయాలన్నారు. పిల్లలు బడులకు రాకుంటే పెనాల్టీ 
వేయొద్దని చెప్పారు. 

విద్యా శాఖ ఇచ్చిన ఇంకొన్ని సూచనలివే..

  •     చేతులను తరచూ సబ్బుతో కడుక్కోవడం, శానిటైజర్ వాడటం. 
  •     ఫిజికల్ అటెండెన్స్ తప్పనిసరి కాదు. వెనకబడిన స్టూడెంట్లపై హెడ్మాస్టర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. 
  •     అవసరమైతే బ్రిడ్జి కోర్సు‌లు పెట్టాలి. బడుల్లో ఫ్రెండ్లీ వాతావరణం కల్పించాలి. 
  •     పెన్సిల్, పెన్, బుక్స్, ఫుడ్, వాటర్ బాటిల్స్, గ్లాసులు, ప్లేట్స్ తదితర వస్తువులేవీ షేర్ చేసుకోకుండా చూసుకోవాలి.
  •     కిచెన్ రూమ్, డైనింగ్ హాల్, డ్రింకింగ్ వాటర్ దగ్గర, బడుల్లోకి ఎంట్రీ, ఎగ్జిట్ టైమ్​లో ఫిజికల్ డిస్టెన్స్ తప్పనిసరి.
  •     ట్రాన్స్‌పోర్ట్ టైమ్​లో కరోనా రూల్స్ ​పాటించాలి. స్టూడెంట్​కు ​బుక్స్ ఇవ్వాలి.