పాతబస్తీ… కొత్త బస్తీ అన్న తేడా లేకుండా రోడ్లను అభివృద్ది చేశామన్నారు మంత్రి కేటీఆర్. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా అక్బరుద్దీన్,సుధీర్ రెడ్డి తదితర సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు..ఎస్ఆర్డీపీ కింద 9 ఫ్లై ఓవర్లు, 4 అండర్ పాస్లు, 3 ఆర్యూబీ, ఒక వంతెనతో పాటు ఒక కేబుల్ బ్రిడ్జీని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కింద మొత్తం 18 ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు నిర్మించామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఈ ప్రాజెక్టు కింద పలు అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామన్న కేటీఆర్..నగర అభివృద్ధికి దాదాపు రూ. 30 వేల కోట్లకు గానూ రూ. 6 వేల కోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు.
