విడాకులు తీసుకోనున్న హైదరాబాద్ భామ దియా మీర్జా

విడాకులు తీసుకోనున్న హైదరాబాద్ భామ దియా మీర్జా

బాలీవుడ్ నటి దియా మీర్జా, సాహిల్ సంగా దంపతులు విడాకులు తీసుకోనున్నట్లు ప్రకటించారు. దీంతో ఐదేళ్ల వారి వైవాహిక జీవితానికి పులిస్టాప్ పడనుంది. దంపతులుగా విడిపోయినప్పటికీ స్నేహితులుగా కలిసే ఉంటామని చెప్పారు దియా దంపతులు. పదకొండేళ్లుగా..  కలిసి ఉన్న తాము ఇప్పుడు విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే ఈ నిర్ణయం పూర్తిగా తమ వ్యక్తిగతమని.. తమ మాటకు గౌరవమిచ్చి తోడుగా నిలిచిన కుటుంబసభ్యులకు, మిత్రులకు థ్యాంక్స్ చెప్పారు.

హైదరాబాద్ కు చెందిన దియా మీర్జా … 2014 లో సాహిల్ సంగాను పెండ్లి చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి బాలీవుడ్ లో పలు సినిమాలను నిర్మించారు. దియా… భారత్ తరపున ఐక్యరాజ్యసమితి పర్యవరణ సంస్థకు గుడ్ విల్ అంబాసిడర్ గా ఉన్నారు.