తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్: హైదరాబాద్-అయోధ్య డైరెక్ట్ ప్లైట్

తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్: హైదరాబాద్-అయోధ్య డైరెక్ట్ ప్లైట్

తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్.. అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు హైదరాబాద్ నుంచి అయోధ్యకు డైరెక్టు విమానం సేవలు అందుబాటులోకి రానున్నాయి.. ఏప్రిల్ 2 నుంచి డైరెక్టు విమానం సేవలు ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 

గత ఫిబ్రవరి 26న  కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియాకు ఈ విషయంపై లేఖ రాశానన్నారు కిషన్ రెడ్డి.వెంటనే స్పందించిన జ్యోతిరాధిత్య సింధియా..రెండు నగరాల మధ్య రాకపోకలకు కమర్షియల్ ఎయిర్ లైన్స్ తో మాట్లాడినట్టు తెలిపారు. 

ఏప్రిల్ 2 నుంచి వారానికి మూడు రోజులు అంటే.. మంగళవారం, గురువారు, శనివారం ఈ విమానం సేవలు అందుబాటులో ఉంటాయని ట్వీట్ చేశారు కిషన్ రెడ్డి. 

ALSO READ | శని నక్షత్రం మారుతున్నాడు.. ఏ రాశి వారికి అదృష్టం వరిస్తుందంటే...