
‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా’ అంటూ ‘పుష్ప’లో సమంత వేసిన స్టెప్స్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో తెలిసిందే. అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలోని పాటలన్నీ హిట్టే. అయితే ఈ పాట మాత్రం వాటిని మించి రికార్డుల్ని సృష్టించింది. అందుకే సీక్వెల్లో కూడా ఓ స్పెషల్ సాంగ్ పెట్టడానికి టీమ్ ఫిక్సయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మే నెలలో కానీ జూన్లో కానీ సెట్స్కి వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. ఫస్ట్ పార్ట్లో ఉన్నవారంతా రెండో పార్ట్లోనూ కనిపించనున్నారు. అయితే ఐటమ్ సాంగ్ మాత్రం దిశా పటానీతో చేయించనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పుడంటే బాలీవుడ్లో బిజీ అయ్యింది కానీ.. దిశ హీరోయిన్గా కెరీర్ ప్రారంభించింది మాత్రం తెలుగులోనే. వరుణ్ తేజ్ ఫస్ట్ మూవీ ‘లోఫర్’లో దిశనే హీరోయిన్. ఈ వార్త కనుక నిజమైతే మళ్లీ ఇన్నాళ్లకి ఆమె టాలీవుడ్లో అడుగు పెడుతుంది. నిజానికి ‘ఊ అంటావా’ పాటకి కూడా మొదట ఒక బాలీవుడ్ హీరోయిన్నే తీసుకున్నారంటూ అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ చివరికి సమంత ఫిక్సయ్యింది. ఈసారి కూడా అలానే అవుతుందా లేక దిశ ఊ అంటుందా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.