ఎంపీ లక్ష్మణ్ తో దివ్యవాణి భేటీ

ఎంపీ లక్ష్మణ్ తో దివ్యవాణి భేటీ

సినీనటి దివ్యవాణి త్వరలో బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్, ఎంపీ లక్ష్మణ్ తో ఆమె భేటీ అయ్యారు. వీరి భేటీ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అంతకుముందు దివ్యవాణి.. ఈటల రాజేందర్ ను కూడా కలిశారు. 2019లో తెలుగుదేశంలో పార్టీలో చేరిన దివ్యవాణి అప్పట్లో చాలా యాక్టివ్ గా ప్రచారం చేశారు. పార్టీ రెబెల్ మహిళా నేతగా పేరు తెచ్చుకున్నారు. అయితే టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో ఆమెకు ఎలాంటి పదవులు దక్కలేదు. పార్టీ అధికార ప్రతినిధి హోదా కల్పించినా టీడీపీలో అంతర్గత వ్యవహారాలు నచ్చడం లేదని ఆరోపిస్తూ  ఇటీవలే పార్టీ నుంచి బయటకు వచ్చారు. టీడీపీకి గుడ్ బై చెప్పిన తర్వాత దివ్యవాణి వైసీపీలోకి వెళ్తారన్న ప్రచారం జరిగింది.

అందరి అంచనాలను తలకిందులు చేస్తూ దివ్యవాణి అనూహ్యంగా బీజేపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ  అనేక మంది సెలబ్రిటీలను, ఇతర పార్టీల నేతలను చేర్చుకునే పనిలో పడింది. ఇప్పటికే బీజేపీలో విజయశాంతి, జీవిత రాజశేఖర్ యాక్టివ్ గా పనిచేస్తున్నారు.