హైదరాబాద్ లో డీజే స్నేక్ కాన్సర్ట్

హైదరాబాద్ లో డీజే స్నేక్ కాన్సర్ట్

ఫ్రెంచ్ పాప్ స్టార్, అందరికీ మ్యూజిక్ ప్రొడ్యూజర్ గా సుపరిచితుడైన డీజే స్నేక్ (విలియం సామి ఎటియెన్నే గ్రిగహ్సిన్) కాన్సర్ట్ ఈ నెల 20న హైదరాబాద్ లో జరగనుంది. సన్‌బర్న్ ఈవెంట్ లో భాగంగా మరో పాప్ స్టార్ ఎపి ధిల్లాన్ తో కలిసి డీజే స్నేక్ ఈడీఎం ఫెస్ట్ లో ఈ కాన్సర్ట్ ఇవ్వనున్నాడు. హైదరాబాద్‌లోని జీఎంఆర్ ఎరేనాలో నిర్వహించే ఈ ఈవెంట్ ను జొమాటో స్పాన్సర్ చేస్తోంది.

ఈ ఏడాది నిర్వహించే సన్‌బర్న్ ఈవెంట్ చాలా పెద్దది. మొత్తం భారతదేశంలోని ఆరు నగరాల్లో ఈ కాన్సర్ట్స్ జరుగుతాయి. నవంబర్ 18న అహ్మదాబాద్, 19న న్యూ ఢిల్లీ, 20న హైదరాబాద్, 25న పుణె, 26న ముంబై, 27న బెంగళూరులో డీజే స్నేక్ ప్రదర్శనలు ఇవ్వనున్నాడు. దీనికి సంబంధించిన టికెట్స్ బుక్‌మై షోలో రూ.999 నుండి అందుబాటులో ఉన్నాయి.

డీజే స్నేక్, తన భారత పర్యటన గురించి చేసిన ట్విట్ తో అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపింది. భారత్తో తనకున్న అనుభవాన్ని పంచుకున్నాడు. అందులో హైదరాబాద్ లో ఫైర్ ఫైటర్స్ కు ట్రిబ్యూట్ ఇస్తూ చేసిన ‘మెజెంటా రిడిమ్’ పాటను గుర్తు చేసుకున్నాడు. ‘ఇండియన్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఇక్కడి పాటల బీట్ లు, అందులోని రిథమ్ బాగా నచ్చుతాయి. పాటలు విన్న ప్రతీసారి కొత్త ఉత్తేజం వస్తుంది’ అని అన్నాడు.