రోడ్లపై ఉండే వారికి 2 వేల బ్లాంకెట్స్ అందజేత

 రోడ్లపై ఉండే వారికి 2 వేల బ్లాంకెట్స్ అందజేత

ఎల్​బీ నగర్, వెలుగు: చలి తీవ్రత పెరగడంతో సిటీలో రోడ్లపై ఉండే వారికి ఇండో ఇన్​ఫ్రా డెవలపర్స్ (ఐఐడీ) సంస్థ బ్లాంకెట్స్ పంపిణీ చేసింది. సంస్థ సీఈఓ శివగణేశ్ బాబు కూతురు ఉన్నతి బర్త్​డే సందర్భంగా ఆదివారం ఎస్ కేపీ అచీవర్స్ టీమ్​తో పాటు సంస్థ సభ్యులు ఎల్​బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, నాగోల్ తదితర ప్రాంతాల్లో 2 వేల మందికి బ్లాంకెట్స్ అందజేశారు. మెంబర్స్​ బాల్ రెడ్డి, వాసవి, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.