మంత్రులు తమ కోసం కొత్తగా ఎలాంటి కార్లు కొనొద్దు

మంత్రులు తమ కోసం కొత్తగా ఎలాంటి కార్లు కొనొద్దు

పార్టీ మంత్రులకు తేజస్వీ సూచన 

పాట్నా: బీహార్ సర్కార్ లో భాగమైన ఆర్జేడీ మంత్రులకు ఆ పార్టీ లీడర్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కొన్ని సూచనలు చేశారు. ఏం చేయాలో? ఏం చేయకూడదో? సూచిస్తూ ఇంటర్నల్ గా ఆదేశాలు ఇచ్చారు. దాన్ని శనివారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘మంత్రులు తమ కోసం కొత్తగా ఎలాంటి కార్లు కొనొద్దు. అందరితో మంచిగా మాట్లాడాలి.. నమస్తే, ఆదాబ్ అంటూ మన సంప్రదాయాలను కొనసాగించాలి. పార్టీ వర్కర్లు, సపోర్టర్లను తమ కాళ్లు మొక్కనివ్వొద్దు.

ఇలాంటివి అస్సలు అనుమతించొద్దు. బొకేలు, గిఫ్టులకు బదులు బుక్స్, పెన్నులు ఇవ్వాలని కోరాలి. ప్రజా సమస్యల పరిష్కారంలో కులం, మతం చూడొద్దు” అని తేజస్వీ సూచించారు. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ప్రజలకు సమాచారం ఇవ్వాలన్నారు.