తలకు బలమైన గాయం కావడంతోనే శ్రావణి మృతి

తలకు బలమైన గాయం కావడంతోనే శ్రావణి మృతి

మూడు రోజుల క్రితం కారు ఢీకొన్న ఘటనలో గాయపడిన డాక్టర్ శ్రావణి చనిపోయింది. హైదరాబాద్ మలక్ పేట్ లో ఈ నెల 21న బైక్ ను కారు ఢీ కొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రావణికి మూడు రోజుల నుంచి నిమ్స్ లో వైద్యులు ట్రీట్మెంట్ అందించారు. కానీ తలకి బలమైన గాయం కావడంతో ఆపరేషన్ చేసినా శ్రావణి బతకలేదు. పరిస్థితి విషమించి ఇవాళ శ్రావణి చనిపోయింది.

హస్తినాపురంలోని ప్రైవేట్ హాస్పిటల్ లో శ్రావణి డెంటల్ డాక్టర్ గా పని చేసేవారు. మూడు రోజుల క్రితం శ్రావణి బైక్ పై వస్తుండగా... వేగంగా వచ్చి బైక్ ని ఢీకొట్టి కారు డ్రైవర్ పారిపోయాడు. హిట్ అండ్ రన్ కేసులో ఇవాళ శ్రావణి మ-ృతి చెందడంతో ఆమె కుటుంబంలో శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనకు కారణమైన నిందితుడిని ఓల్డ్ మలక్ పేటకు చెందిన ఇబ్రహీంగా గుర్తించారు. అయితే నిందితుడికి లైసెన్స్, కారుకు పేపర్లు సైతం లేవని పోలీసులు వెల్లడించారు.