హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్న ఈటల

హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్న ఈటల

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను, ఔన్నత్యాన్ని చాటేలా శోభాయాత్ర నిర్వహించడం సంతోషంగా ఉందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బాలానగర్ ఐడీపీఎల్ కాలనీలో హిందూవాహిని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హిందూవాహిని ఆధ్వర్యంలో గత 12ఏళ్లుగా హనుమాన్ శోభాయాత్ర నిర్వహిస్తున్నారని ఈటల అన్నారు. జగద్గిరి గుట్ట నుంచి ఐడీపీఎల్ వరకు దాదాపు 12 కిలోమీటర్ల మేర శోభాయాత్ర కొనసాగుతుందని చెప్పారు. మన సంస్కృతి, సంప్రదాయాలను రాబోయే తరాలకు అందించే గొప్ప కర్తవ్యమే శోభాయాత్ర అని ఈటల అభిప్రాయపడ్డారు. 

మరిన్ని వార్తల కోసం..

హనుమాన్ భజనలతో మార్మోగిన కొండగట్టు

గుట్టలో బాలాలయం తొలగింపు