నలుగురు మంత్రులు, స్పీకర్ తొలిరోజే కోడ్ ​ఉల్లంఘన

నలుగురు మంత్రులు, స్పీకర్ తొలిరోజే కోడ్ ​ఉల్లంఘన

అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న నలుగురు మినిస్టర్లు, స్పీకర్

వెలుగు, నెట్​వర్క్: రాష్ట్రంలో నలుగురు మంత్రులు, అసెంబ్లీ స్పీకర్ మంగళవారం మున్సిపల్​ ఎన్నికల కోడ్​ను ఉల్లంఘించారు. మినిస్టర్లు ఐకే​రెడ్డి, ప్రశాంత్​రెడ్డి, పువ్వాడ అజయ్​కుమార్, గంగుల కమలాకర్, స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి ఎలక్షన్​​కోడ్​ను ఏమాత్రం పట్టించుకోకుండా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సోమవారం రాత్రి మున్సిపల్​ఎన్నికల​షెడ్యూల్​ విడుదల కావడంతో అదే రోజు నుంచి కోడ్​ అమల్లోకి వచ్చింది. కానీ  మంగళవారం నిర్మల్​ జిల్లాలో పర్యటించిన రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖమంత్రి ఇంద్రకరణ్​రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్‍ జిల్లాలోని మిషన్‍ భగీరథ పనులు, సాగునీటి ప్రాజెక్టులపై కలెక్టరేట్​లో రివ్యూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితాసబర్వాల్ కూడా పాల్గొన్నారు. అంతకు ముందు వీరిద్దరూ సదర్మట్, చనఖ కోర్ట​ బ్యారేజీ పనులను పరిశీలించారు. ఈ బ్యారేజీలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజీ 27, 28 పనుల్లో వేగం పెంచాలని,  భగీరథ పనులు పూర్తిచేసి, ఇంటింటికీ తాగునీరివ్వాలని ఐకేరెడ్డి ఆదేశించారు.

కామారెడ్డి జిల్లాలో మంత్రి ప్రశాంత్​రెడ్డి.. 

పల్లె ప్రగతి అమలుపై కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బీటీఎస్​వద్ద ఉన్న తెలంగాణ సౌత్ క్యాంపస్ లో లీడర్లు, ఆఫీసర్లతో ఆర్అండ్ బీ, గృహనిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి మంగళవారం రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా కామారెడ్డి జిల్లాకు రూ.46 కోట్ల నిధులు ఇచ్చామని చెప్పారు. మద్నూర్ మండలం లింబూర్ వద్ద కోటగిరి మండలం పోతంగల్ వరకు సీఆర్ నిధులు రూ.28 కోట్లతో నిర్మించే డబుల్​లైన్​రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. కాగా, నిజామాబాద్​ జిల్లా వర్ని మండలం తగిలెపల్లి గ్రామంలో నిర్మించిన డబుల్‌‌బెడ్‌‌రూం ఇళ్లను మంగళవారం  స్పీకర్‌‌ పోచారం శ్రీనివాస్​రెడ్డి ప్రారంభించి మాట్లాడారు.

ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం జిల్లా మధిర మండలం ఖమ్మంపాడు గ్రామంలో రూ.6.40 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్​లో గంగుల రివ్యూ..

కరీంనగర్​లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఐటీ టవర్ లో కంపెనీల ప్రారంభానికి తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం హైదరాబాద్​లోని టీఎస్​ఐఐడీసీ కార్యాలయంలో మంత్రి గంగుల కమలాకర్  ఐటీ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక మండలి వైస్​చైర్మన్​బోయినపల్లి  వినోద్ కుమార్ కూడా పాల్గొన్నారు.