ఇవాళ ( మే 30 ) ముంబై, గుజరాత్ మధ్య ఎలిమినేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌: ముందుకా..? ఇంటికా..?

ఇవాళ ( మే 30 ) ముంబై, గుజరాత్ మధ్య ఎలిమినేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌: ముందుకా..? ఇంటికా..?

లీగ్ దశ చివర్లో ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న శుభ్‌‌‌‌‌‌‌‌మన్ గిల్  కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్‌–18లో నాకౌట్ సమరానికి సిద్ధమైంది. శుక్రవారం జరిగే ఎలిమినేటర్‌‌‌‌‌‌‌‌  మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో బలమైన ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌తో చావోరేవో తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2కు అర్హత సాధించనుండగా.. ఓడిన జట్టు ఇంటిదారి పట్టనుంది. దాంతో ఇరు జట్లపైనా తీవ్ర ఒత్తిడి ఉండనుంది.  టైటాన్స్ గత నాలుగు సీజన్లలో మూడుసార్లు ప్లేఆఫ్స్‌‌‌‌‌‌‌‌కు చేరుకుంది. 2022లో బరిలోకి దిగిన తొలి ప్రయత్నంలోనే టైటిల్ కూడా నెగ్గింది. మరోవైపు ఐదుసార్లు చాంపియన్  ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌కు నాకౌట్‌‌‌‌‌‌‌‌ రౌండ్ కొత్తేం కాదు. ఇక శుభ్‌‌‌‌‌‌‌‌మన్ గిల్ తో పాటు  హార్దిక్ పాండ్యా తనను తాను నిరూపించుకోవాలని చూస్తున్నాడు. ఇండియా టెస్ట్ కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా అపాయింట్‌‌‌‌‌‌‌‌ అయిన గిల్ టైటాన్స్ కు కప్పు అందిస్తే అతని లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ స్కిల్స్ మరింత బలపడతాయి. ఇంకోవైపు గతేడాది ముంబై టీమ్‌‌‌‌‌‌‌‌లోకి తిరిగొచ్చినప్పుడు అభిమానుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్న హార్దిక్ ఈసారి జట్టును ప్లే ఆఫ్స్‌‌‌‌‌‌‌‌  చేర్చి వాళ్ల మనసు తిరిగి గెలుచుకున్నాడు. అయితే, ఐపీఎల్ ట్రోఫీ గెలిస్తే కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా మరికొన్నాళ్లు అతని ప్రయాణానికి ఢోకా ఉండదు. 

బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో జీటీ డీలా

 ఈ సీజన్ ఆరంభం నుంచి నిలకడగా ఆడిన టైటాన్స్ ప్లేఆఫ్స్‌‌‌‌‌‌‌‌కు ముందు ఫామ్ కోల్పోయి డీలా పడింది. గత రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో ఓడిన ఆ జట్టు  ఏకంగా 465 రన్స్ సమర్పించుకుంది. దాంతో బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో తక్షణమే మెరుగవ్వాలి. పేస్ బౌలింగ్ లీడర్ మహ్మద్ సిరాజ్ పవర్‌‌‌‌‌‌‌‌ప్లేలో వికెట్లు తీయాల్సి ఉంటుంది. కొత్త బాల్‌‌‌‌‌‌‌‌తో మరో పేసర్ అర్షద్ ఖాన్ ఇబ్బందిపడుతున్నాడు. దాంతో ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో 23 వికెట్లతో టైటాన్స్‌‌‌‌‌‌‌‌కు ట్రంప్ కార్డ్‌‌‌‌‌‌‌‌గా నిలిచిన ప్రసిద్ధ్ కృష్ణపై ఒత్తిడి పెరుగుతోంది. దీనికి తోడు స్పిన్ ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్ రషీద్ ఖాన్ ఏమాత్రం ప్రభావం చూపకపోవడం టైటాన్స్ బౌలింగ్ కష్టాలను మరింత పెంచింది. ముంబై లో భారీ హిట్టర్లు ఉన్న నేపథ్యంలో జీటీ బౌలింగ్ మెరుగైతేనే ఆ టీమ్‌‌‌‌‌‌‌‌కు గట్టి పోటీ ఇవ్వగలదు. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లోనూ జీటీకి కొన్ని సమస్యలు ఎదురుకానున్నాయి. ఓపెనర్లు  సాయి సుదర్శన్, గిల్ షామ్‌లో ఉన్నా.. టాపార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరో కీలక ప్లేయర్  జోస్ బట్లర్‌‌‌‌‌‌‌‌ సేవలు కోల్పోవడం ఆ జట్టుకు ఎదురుదెబ్బ.  బట్లర్ స్థానంలో కుశాల్ మెండిస్‌‌‌‌‌‌‌‌ను తీసుకున్నప్పటికీ తను అదే స్థాయిలో ఆడతాడని కోరుకోలేం. షారుఖ్ ఖాన్, రూథర్‌‌‌‌‌‌‌‌ఫోర్డ్‌‌‌‌‌‌‌‌లతో కూడిన మిడిలార్డర్ బలంగా లేకపోవడం ముంబైకి అనుకూలం కానుంది. 

 ముంబైకి బ్యాటింగ్ సమస్యలు:

టైటాన్స్ మాదిరిగా ముంబై ఇండియన్స్ కూడా ఫారిన్ క్రికెటర్ల సేవలు కోల్పోయి ఇబ్బంది ఎదుర్కోనుంది. రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌‌‌‌‌‌‌‌గా రాణించిన సౌతాఫ్రికా స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ర్యాన్ రికెల్టన్ స్వదేశానికి వెళ్లిపోయాడు. ఇంగ్లిష్ క్రికెటర్ విల్ జాక్స్ కూడా జట్టును వీడాడు. రిచర్డ్ గ్లీసన్, చరిత్ అసలంకతో పాటు ముంబై టీమ్‌‌‌‌‌‌‌‌లో రీప్లేస్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వచ్చిన జానీ బెయిర్‌‌‌‌‌‌‌‌స్టో.. రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. కానీ, బెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టో ఫామ్‌‌‌‌‌‌‌‌లో లేకపోవడం మైనస్ కానుంది. తిలక్ వర్మ నిలకడగా రాణించకపోవడం జట్టుకు మరో ప్రధాన సమస్య. సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే అత్యంత నిలకడగా ఆడుతున్నాడు. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో రికార్డు స్థాయిలో 640 రన్స్ చేసిన సూర్య ముంబై బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెన్నుగా నిలుస్తున్నాడు. ఒకవేళ అతను విఫలమైతే, ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌కు కష్టాలు తప్పవు. పైగా ఫస్ట్ బ్యాటింగ్ చేసేటప్పుడు ముంబై బ్యాటర్లు అంత వేగంగా ఆడటం లేదు. కెప్టెన్ హార్దిక్ దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అయితే, బుమ్రా, బౌల్ట్‌‌‌‌‌‌‌‌, దీపక్ చహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శాంట్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పాండ్యాతో కూడిన  బలమైన బౌలింగ్ ఎటాక్‌‌‌‌‌‌‌‌ ముంబై ప్రధాన అస్త్రం. కానీ, బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లోనూ సత్తా చాటితేనే ముంబై ముందుకు వెళ్లగలదు.