
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా లీడ్స్ వేదికగా శుక్రవారం (జూన్ 20) తొలి టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఇంగ్లాండ్ తమ ప్లేయింగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు భారత జట్టులో సాయి సుదర్శన్ తుది జట్టులో స్థానం సంపాదించాడు. దీంతో భారత్ తరపున తొలి టెస్ట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. మూడో స్థానంలో సాయి సుదర్శన్ బ్యాటింగ్ చేయనున్నట్టు కెప్టెన్ గిల్ టాస్ సమయంలో కన్ఫర్మ్ చేశాడు. 8 ఏళ్ళ తర్వాత కరుణ్ నాయర్ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI):
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్
భారత్ (ప్లేయింగ్ XI):
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ