
లండన్: టార్గెట్ ఛేజింగ్లో జెమీ స్మిత్ (64), బెన్ డకెట్ (58), జో రూట్ (44), జోస్ బట్లర్ (41 నాటౌట్) దంచికొట్టడంతో.. మంగళవారం అర్ధరాత్రి ముగిసిన మూడో వన్డేలోనూ ఇంగ్లండ్ 7 వికెట్ల తేడా (డక్వర్త్ లూయిస్)తో వెస్టిండీస్పై గెలిచింది. ఫలితంగా మూడు మ్యాచ్ల సిరీస్ను హోమ్ టీమ్ 3–0తో క్లీన్స్వీప్ చేసింది. ట్రాఫిక్ లైట్లు పని చేయకపోవడం వల్ల వెస్టిండీస్ బస్సు సకాలంలో స్టేడియానికి చేరుకోలేకపోయింది. దాంతో షెడ్యూల్ టైమ్కు టాస్ వేయలేదు. ఫలితంగా మ్యాచ్ను 40 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడిన విండీస్ 251/9 స్కోరు చేసింది.
షెర్ఫానే రూథర్ఫోర్డ్ (70), గుడకేశ్ మోతీ (63), అల్జారీ జోసెఫ్ (41) మినహా మిగతా వారు విఫలమయ్యారు. ఆదిల్ రషీద్ 3, సకీబ్ మహ్ముద్, బ్రైడన్ కార్సీ, మాథ్యూ పాట్స్ తలా రెండు వికెట్లు తీశారు. వర్షం వల్ల 90 నిమిషాల ఆట తుడిచి పెట్టుకుపోవడంతో ఇంగ్లండ్ టార్గెట్ను 40 ఓవర్లలో 246 రన్స్గా సవరించారు. దీన్ని ఇంగ్లిష్ టీమ్ 29.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అల్జారీ జోసెఫ్, గుడకేశ్ మోతీ, రోస్టన్ ఛేజ్ తలో వికెట్ పడగొట్టారు. జెమీ స్మిత్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, రూట్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.