
- 119 నియోజకవర్గాలకు రూ.1190 కోట్లు
- విద్యా రంగం, తాగునీటి అవసరాలు, కలెక్టరేట్ భవనాల నిర్వహణకు వినియోగం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు రూ.10 కోట్ల చొప్పున 119 నియోజకవ ర్గాలకు మొత్తం రూ. 1,190 కోట్ల స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్స్ కు రాష్ట్ర ప్రభుత్వం అనమతులు ఇచ్చింది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపుల నుంచి ఆ నిధులను విడుదల చేయనుంది. జిల్లా ఇన్చార్జి మంత్రుల పర్యవేక్షణలో కలెక్టర్ల ద్వారా నిర్దిష్టమైన పనుల కోసం వాటిని విడు దల చేయనున్నామని గత నెల 30న రిలీజ్ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఆ నిధులను ఏయే అవసరాలకు ఖర్చు పెట్టాలో స్పష్టం చేసింది.
ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు విడుదల చేయాలనుకున్న రూ.10 కోట్లను గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని విద్యా రంగంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.2 కోట్లు, తాగునీటికి ఒక కోటి , కలెక్టరేట్ భవనాల నిర్వహణకు రూ.50 లక్షల చొప్పున వినియోగించాలని స్పష్టం చేసింది. అభివృద్ధి, నిర్వహణ అవసరాలకు మాత్రమే ఆ నిధులను వినియోగించాలని పేర్కొంది. అందుకు జిల్లా ఇన్చార్జి మంత్రుల నుంచి ఆమోదం పొందాల్సి ఉంటుందని తెలిపింది.
క్షేత్రస్థాయిలో పనులు జరిగేటప్పుడు సంబంధిత వర్క్ ఆర్డర్లు, ఏజెన్సీ ఎంపిక, ఆయా పనులకు సంబంధించిన అం చనా వ్యయం, ఏయే శాఖలకు సంబంధించినవి, వాటి నుంచి ఏమైనా నిధులు విడుదలయ్యాయా అన్న వివరాలను కలెక్టర్లు పరిశీలించాలని సూచించిం