వందలారీల్లో జనాలను తీసుకెళ్లి నామినేషన్ వేయిస్తా

వందలారీల్లో జనాలను తీసుకెళ్లి నామినేషన్ వేయిస్తా

వరంగల్: దళితులకు కూడా దళితబంధు అమలు చేయాలని.. లేకపోతే వందలారీల్లో జనాలను తీసుకెళ్లి హుజురాబాద్‎లో నామినేషన్ వేయిస్తానని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ అన్నారు. టీఆర్ఎస్ నేతలు అంతా కేసీఆర్‎కు ఊడిగం చేసేవారేనని ఆయన అన్నారు. టీఆర్ఎస్‎లో దళిత నేతలకు సిగ్గుంటే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

‘2018లో కొండా సురేఖను ఓడించేందుకు కేసీఆర్ 500 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు ఈటల రాజేందర్‎ను ఓడించేందుకు వేలకోట్లు ఖర్చు చేస్తున్నారు. నేను కేసీఆర్ దగ్గరికి వెళ్లినప్పుడు బూట్లు విడవలేదని కక్ష కట్టాడు. వరంగల్‎కు చెందిన టీఆర్ఎస్ కార్పొరేటర్లు నా కాళ్ళు పట్టుకుని టికెట్ అడుక్కుని.. నాకాళ్లే లాగేశారు. హుజురాబాద్‎లో పోటీచేయాలని కొండా సురేఖను కాంగ్రెస్ అధిష్ఠానం అడుగుతోందంటే మాపై ఎంత నమ్మకముందో అర్థం చేసుకోండి’ అని కొండా మురళీ అన్నారు.