గచ్చిబౌలి, వెలుగు: కర్ణాటక రాష్ట్రం మైసూరులోని భారతీయ భాషా సంస్థలో శిక్షణ పొందుతున్న పరిశోధకులు, అధ్యాపకులు సోమవారం గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని సందర్శించారు. వర్సిటీలోని తెలుగు శాఖ, అంతరిస్తున్న భాషలు అండ్మాతృభాషల అధ్యయన సంస్థ(సీఈఎల్అండ్ఎంటీఎస్) శాఖను సందర్శించారు. ఆరుగురు సభ్యులతో కూడిన ఈ బృందానికి డా.మిరియాల సత్యనారాయణ లీడ్గా వ్యవహరించారు.10 నెలల కోర్సులో భాగంగా మైసూరులో తెలుగు, మలయాళం, కన్నడ, తమిళంపై ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపారు.
తెలుగు భాషా వైవిద్యాన్ని తెలుసుకునేందుకు హెచ్సీయూని సందర్శించామన్నారు. తెలుగు భాషా సంస్కృతిక, చారిత్రక, మత, సామాజిక, ఆర్థికాంశాలను లోతుగా తెలుసుకుంనేందుకు 14 రోజుల పాటు ఎడ్యుకేషన్టూర్నిర్వహిస్తున్నామన్నారు. హెచ్సీయూ తెలుగు శాఖ అధ్యక్షుడు దార్ల వెంకటేశ్వర్రావు, సీఐఎల్ అండ్ ఎంటీఎస్ శాఖ అధ్యక్షుడు పమ్మి పవన్ కుమార్ వారికి పలు అంశాలను వివరించారు.