IPL గెలిచింది.. డొమెస్టిక్ క్రికెట్ ఓడింది: అభిమన్యు ఈశ్వరన్‎కు జట్టులో చోటు దక్కకపోవడంతో BCCIపై విమర్శలు

IPL గెలిచింది.. డొమెస్టిక్ క్రికెట్ ఓడింది: అభిమన్యు ఈశ్వరన్‎కు జట్టులో చోటు దక్కకపోవడంతో BCCIపై విమర్శలు

డొమెస్టిక్ క్రికెట్‎లో పరుగుల వరద పారిస్తున్నా టాలెంటెడ్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్‎కు మరోసారి నిరాశ ఎదురైంది. టీమిండియా తరుఫున టెస్ట్ క్రికెట్‎లో అరంగ్రేటం చేసేందుకు ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న ఈ బెంగాల్ బ్యాటర్‎కు మరోసారి నిరీక్షణ తప్పలేదు. ఇంగ్లాండ్‎తో జరుగుతోన్న ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్‎కు భారత జట్టులో అభిమన్యు ఈశ్వరన్‎కు చోటు దక్కింది. కానీ శుక్రవారం (జూన్ 20) లీడ్స్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టు ప్లేయింగ్ లెవన్‎లో ఈశ్వరన్‎కు స్థానం దక్కలేదు. 

ఈశ్వరన్ స్థానంలో ఐపీఎల్ 2025 పరుగుల వీరుడు సాయి సుదర్శన్ వైపు బీసీసీఐ మొగ్గు చూపింది. దీంతో భారత్ తరుఫున టెస్ట్ అరంగ్రేటం కోసం ఏండ్లుగా ఎదురుచూస్తోన్న ఈశ్వరన్‎కు మళ్లీ నిరాశే ఎదురైంది. అయితే.. ఈశ్వరన్ స్థానంలో జట్టుకు ఎంపికైన సాయి సుదర్శన్ తొలి టెస్ట్ ఫస్ట్ ఇన్సింగ్స్‎లో డకౌట్ కావడంతో బీసీసీఐపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఐపీఎల్‎లో రాణించిన ప్లేయర్లకే బీసీసీఐ జట్టులో అవకాశాలు ఇస్తుందని.. దేశవాళీ క్రికెట్‎లో టన్నుల కొద్ది పరుగులు చేసిన  బీసీసీఐ పట్టించుకోదని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

అభిమన్యు ఈశ్వరన్ కు జట్టులో చోటు దక్కకపోవడంతో ‘మరోసారి ఐపీఎల్ గెలిచింది.. దేశవాళీ క్రికెట్ ఓడిపోయింది’’ అని ఓ నెటిజన్ బీసీసీఐ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. సాయి సుదర్శన్ మంచి ఆటగాడే కానీ ఎంతో కాలంగా జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తోన్న అభిమన్యు ఈశ్వరన్ కు ఒక్కసారి అవకాశం ఇవాల్సిందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

కాగా, 29 ఏళ్ల ఈశ్వరన్ 2022లో బంగ్లాదేశ్ పర్యటనలో తొలిసారిగా భారత జట్టుకు ఎంపిక అయ్యాడు. కానీ అతడికకి ఒక్క మ్యాచులో కూడా ఆడే అవకాశం దక్కలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి కూడా టీమిండియాకు ఎంపిక అయ్యాడు. కానీ ఇక్కడ కూడా సేమ్ అదే సీన్. ఒక్క మ్యాచులో కూడా ప్లేయింగ్ లెవన్‎లో చోటు దక్కలేదు. ఇప్పుడు ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు కూడా సెలెక్ట్ అయ్యాడు. తొలి టెస్ట్ లో ఆడే ఛాన్స్ రాలేదు. మరీ మిగిలిన నాలుగు మ్యాచుల్లోనైనా ఈశ్వరన్‎కు చోటు దక్కుతుందో లేదో చూడాలి.