ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని రోడ్డెక్కిన రైతులు

ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని రోడ్డెక్కిన రైతులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ PACS పరిధిలో వెంటనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు రైతులు. పోతుగల్ ప్రాథమిక వ్యవసాయ కేంద్రం ముందు బైటాయించి ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన తెలిపారు. నెల రోజుల నుంచి ధాన్యం కుప్పలు పోసి ఎదురుచూస్తున్నా వ్యవసాయ శాఖ అధికారులు స్పందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ధాన్యాన్ని తీసుకొస్తే అధికారులు కొనుగోలు చేయట్లేదని రైతులు వాపోతున్నారు. అకాల వర్షాల భారీ నుంచి ధాన్యాన్ని కాపాడుకుంటూ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ళదిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.