
న్యూఢిల్లీ: జాతీయ రహదారులపై టోల్ చెల్లింపులను సులభతరం చేసేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురానుంది. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి రూ. 3,000తో ఫాస్టాగ్ ఆధారిత యాన్యువల్ పాస్ను ప్రవేశపెట్టనుంది. ఈ పాస్తో ఒక ఏడాదిలో 200 ట్రిప్స్ వరకు ఒకే ఛార్జ్తో రహదారులపై ప్రయాణించొచ్చు.
కమర్షియల్ కాని ప్రైవేట్ వెహికల్స్ (కార్లు, జీపులు, వ్యాన్లు)కి మాత్రమే ఈ యాన్యువల్ పాస్ - వర్తిస్తుంది. దీనితో ఫాస్టాగ్ను తరచూ రీచార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. టోల్ చెల్లింపుల ఇబ్బంది లేకుండా జాతీయ రహదారుల్లో ఈజీగా ప్రయాణించేందుకు ఈ పాస్ సాయపడుతుందని రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్టర్ నితిన్ గడ్కరీ ఎక్స్లో పేర్కొన్నారు.
“ రూ.3,000తో ఫాస్టాగ్ ఆధారిత యాన్యువల్ పాస్ను ఆగస్టు 15, 2025 నుంచి ప్రవేశపెడుతున్నాం. ఈ పాస్ ఒక సంవత్సరం లేదా 200 ట్రిప్స్ వరకు చెల్లుతుంది( ఏది ముందు వస్తే అది). ఇది ప్రైవేట్ నాన్-కమర్షియల్ కార్లు, జీపులు, వ్యాన్లు కోసం రూపొందించబడింది” అని గడ్కరీ పేర్కొన్నారు. రాజ్మార్గ్ యాత్ర యాప్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అధికారిక వెబ్సైట్లలో త్వరలో యాక్టివేషన్, రెన్యూవల్ కోసం సపరేట్లింక్ అందుబాటులో ఉంటుంది.