కేటిదొడ్డి, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో భార్య కాపురానికి రావట్లేదని కన్నకొడుకుతో పురుగుల మందు తాగించి చంపాడో తండ్రి. కేటిదొడ్డి ఎస్సై కురుమయ్య, బాలుడి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కుచినేర్ల గ్రామానికి చెందిన నర్సమ్మకు, నందిన్నె గ్రామానికి చెందిన కుర్వ కరెప్పకు మూడేండ్ల కింద పెళ్లయింది. వీరికి కొడుకు భరత్(2) ఉన్నాడు. కాగా ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో కొడుకును తీసుకుని నర్సమ్మ పుట్టింటికి వెళ్లిపోయింది. సోమవారం భార్య వద్దకు వెళ్లిన కురుమయ్య మరోసారి గొడవపడ్డాడు. నర్సమ్మ కాపురానికి రాననడంతో కోపంలో ఇంట్లోని పురుగల మందును భరత్తో తాగించాడు. అనంతరం భార్య వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. గుర్తించిన నర్సమ్మ కొడుకును రాయచూరు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ బాలుడు చనిపోయాడు. నర్సమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
భార్య కాపురానికి రావట్లేదని కొడుకుని చంపిండు
- తెలంగాణం
- December 1, 2021
లేటెస్ట్
- తయారీలో సమస్యలు.. మందులు రీకాల్ చేసుకుంటున్న ఫార్మా కంపెనీలు
- ఖమ్మం జిల్లాలో వ్యవసాయ పనులు షురూ..!
- చిట్టీల పేరుతో భారీ మోసం.. మీడియాతో 50 మంది బాధితుల ఆవేదన
- ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ క్రాష్
- మహబూబ్నగర్లో స్కూల్ ఎడ్యుకేషన్పై సర్కార్ ఫోకస్
- ఆదిలాబాద్లో విత్తనాలకు కృత్రిమ కొరత
- నా భార్య నన్ను వేధిస్తోంది..ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు
- గ్రేటర్ హైదరాబాద్పై సర్కార్ స్పెషల్ ఫోకస్
- ఎరువులు రెడీ.. 1.34 కోట్ల ఎకరాల్లో సాగు అంచనా
- పెద్దపల్లి జిల్లాలో ఆరుతడి పంటల వైపు రైతుల చూపు
Most Read News
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- నైరుతి రుతుపవనాల పై కీలక అప్డేట్
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్ : రియల్మీ 5జీ ఫోన్ బంపరాఫర్.. ఒక్కరోజు మాత్రమే
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- Good Health: జాజికాయ గురించి షాకింగ్ నిజాలు ఇవే.. రోజూ చిటికెడు పొడిని తింటే..!
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ..కొనసాగుతున్న గాలింపు చర్యలు