భార్య కాపురానికి రావట్లేదని కొడుకుని చంపిండు

భార్య కాపురానికి రావట్లేదని కొడుకుని చంపిండు

కేటిదొడ్డి, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో భార్య కాపురానికి రావట్లేదని కన్నకొడుకుతో పురుగుల మందు తాగించి చంపాడో తండ్రి. కేటిదొడ్డి ఎస్సై కురుమయ్య, బాలుడి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కుచినేర్ల గ్రామానికి చెందిన నర్సమ్మకు, నందిన్నె గ్రామానికి చెందిన కుర్వ కరెప్పకు మూడేండ్ల కింద పెళ్లయింది. వీరికి కొడుకు భరత్(2) ఉన్నాడు. కాగా ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో కొడుకును తీసుకుని నర్సమ్మ పుట్టింటికి వెళ్లిపోయింది. సోమవారం భార్య వద్దకు వెళ్లిన కురుమయ్య మరోసారి గొడవపడ్డాడు. నర్సమ్మ కాపురానికి రాననడంతో కోపంలో ఇంట్లోని పురుగల మందును భరత్​తో తాగించాడు. అనంతరం భార్య వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. గుర్తించిన నర్సమ్మ కొడుకును రాయచూరు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ బాలుడు చనిపోయాడు. నర్సమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.