అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య ‘ఏఐఎఫ్ఎఫ్’ ను ఫిఫా రద్దు చేసింది. సంబంధం లేని(థర్డ్ పార్టీ) వ్యక్తుల జోక్యం ఉన్న కారణంతో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ఫిఫా చట్టాలను ఉల్లంఘించడం సహా థర్డ్ పార్టీల ఇన్వాల్వ్ మెంట్ ఉన్నందున్న ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా కౌన్సిల్ బ్యూరో ఏకగ్రీవంగా నిర్ణయించిందని ఫిఫా పేర్కొంది. ఈ సస్పెన్షన్ కారణంగా ఈ ఏడాది అక్టోబర్ 11 నుంచి 30 తేదీల్లో ఇండియాలో జరగాల్సిన FIFA U-17 మహిళల ప్రపంచ కప్ 2022 టోర్నీపై అనిశ్చితి నెలకొంది. భారత్ నుంచి టోర్నీని మరో దేశానికి తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
టోర్నమెంట్ నిర్వహణకు సంబంధించిన తదుపరి చర్యలను అంచనా వేస్తున్నామని, అవసరమైతే కౌన్సిల్ బ్యూరోకు రిఫర్ చేస్తామని ఫిఫా తెలిపింది. ఈ మేరకు భారత క్రీడా మంత్రిత్వశాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, ఇందుకు సంబంధించి సానుకూల ఫలితం వస్తుందనే ఆశాభావంతో ఉన్నామని ఫిఫా పాలకమండలి వెల్లడించింది. మరోవైపు భారత ఫుట్బాలర్స్ అంతా ప్రపంచ ఫుట్బాల్ సమాఖ్య (ఫిఫా) హెచ్చరికల్ని పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టాలని స్టార్ స్ట్రయికర్ సునీల్ ఛెత్రి సూచించాడు. ఈ విషయంపై ఆటగాళ్లు అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పాడు.
FIFA suspends All India Football Federation
— ANI Digital (@ani_digital) August 16, 2022
Read @ANI Story | https://t.co/IPoM5AOoQh#BreakingNews #FIFA #AIFF pic.twitter.com/hrxBI6uONL
