కాంగ్రెస్ హయాంలోనే ఆదివాసీలపై కాల్పులు 

కాంగ్రెస్ హయాంలోనే ఆదివాసీలపై కాల్పులు 

కాంగ్రెస్ హయాంలోనే ఆదివాసీలను పిట్టలను కాల్చినట్లు కాల్చారని అన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగురామన్న. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెళ్లి కాంగ్రెస్ దళిత గిరిజన దండోరాపై జోగురామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 దశాబ్దాలు గడిచినా..అప్పటి కాంగ్రెస్ ఆగడాలు ఆదివాసీలు మార్చిపోలేదన్నారు. ఇంద్రవెళ్లి మరో జలియన్ వాలాబాగ్ కావడానికి కాంగ్రెస్ పార్టీ కారణమన్నారు. కాంగ్రెస్ హయాంలో అమరుల స్థూపం  దగ్గర నివాళులు అర్పించడానికి కూడా అనుమతులివ్వలేదని తెలిపారు. సభ పెట్టినంత మాత్రాన కాంగ్రెస్ ఆగడాలను జనం మర్చిపోరన్నారు. రేవంత్ రెడ్డి సభ పుండు మీద కారం చల్లినట్టుగా ఉందన్నారు. ఓటుకు నోటులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి.. డ్రామాలు, కపట ప్రేమలు ఆదిలాబాద్ ప్రజలు నమ్మరని తెలిపారు.