జమ్ము కశ్మీర్లోని పాక్ సరిహద్దు సమీపంలో చెలరేగిన మంటల కారణంగా సుమారు అర డజను ల్యాండ్ మైన్లు పేలినట్టు ఇటీవలే అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా ఎల్ వోసీ ప్రాంతంలో రాజుకున్న ఈ కార్చిచ్చు మెండర్ సెక్టార్లో పాకిస్తాన్ నుంచి భారత్ వైపుకు వచ్చినట్టుగా తెలుస్తోంది. భారత్లోకి సరిహద్దు గుండా అక్రమంగా చొరబడే వారిని అడ్డుకోవడానికి జవాన్లు ల్యాండ్మైన్లు నాటారు. అయితే, సరిహద్దు అడవుల్లో మొదలైన ఈ కార్చిచ్చు కారణంగా ఆ ల్యాండ్మైన్లు పేలిపోయినట్టు అధికారులు వెల్లడించారు. సుమారు మూడు రోజులపాటు కొనసాగిన ఈ మంటలను ఆర్మీ సహకారంతో అటవీ అధికారులు ఆర్పే ప్రయత్నాలు చేశారు. కొంత మేర అదుపులోకి తెచ్చామని కూడా వారు ఇప్పటికే వెల్లడించగా.. ఆ నిప్పు రవ్వలు రాజుకొని అడవి అంతటా మంటలు వ్యాపించే వీడియోను తాజాగా అధికారులు విడుదల చేశారు.
#WATCH Jammu and Kashmir | Morning visuals of a forest fire that broke out 2 days ago along the LoC in Mendhar sector in Poonch district pic.twitter.com/d4DCwprwK7
— ANI (@ANI) May 28, 2022
మరిన్ని వార్తల కోసం...