ఆర్థికవేత్త అభిజిత్‌ సేన్‌ ఇక లేరు

ఆర్థికవేత్త అభిజిత్‌ సేన్‌ ఇక లేరు

ప్రభుత్వ ఆర్థికవేత్త అభిజిత్ సేన్ సోమవారం రాత్రి కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 72 సంవత్సరాలు.  రాత్రి 11 గంటల సమయంలో అభిజిత్ సేన్ కు గుండెపోటు రాగా ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లుగా అభిజిత్  సోదరుడు డాక్టర్ ప్రణబ్ సేన్ చెప్పారు.

బెంగాలీ కుటుంబానికి చెందిన అభిజిత్ సేన్...  స్టీఫెన్స్ కళాశాలలో ఫిజిక్స్ హానర్స్ చదివి...  కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో ఎకనామిక్స్ లో పీహెచ్‌డీ చేశారు. ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రాన్ని బోధించారు. వ్యవసాయ వ్యయం, ధరల కమిషన్   ఛైర్మన్ తో సహా అనేక ముఖ్యమైన ప్రభుత్వ పదవులను ఆయన నిర్వహించారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఎంతో పట్టున్న అభిజిత్ సేన్ .. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో అంటే 2004 నుంచి 2014 వరకు భారత ప్రణాళికా సంఘం సభ్యుడిగా సేవలందించారు.  అభిజిత్ సేన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.